News June 28, 2024

నిడదవోలు: సమన్వయంతో పనిచేయాలి: మంత్రి దుర్గేష్

image

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులైన పేదలకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Similar News

News December 23, 2025

ప.గో: జిల్లాకు 5,288 టన్నుల యూరియా సరఫరా

image

జిల్లాకు డిసెంబర్ నెలకు సంబంధించి 23,018 టన్నుల యూరియా తాడేపల్లిగూడెం రైల్వే ర్యాక్‌కు వచ్చిందని, ప్రైవేట్ డీలర్లు, మార్క్ ఫెడ్, సొసైటీలకు 5,288 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు ఏడీఏ ఆర్.గంగాధర్ రావు మంగళవారం తెలిపారు. తాడేపల్లిగూడెం 1,653, పెంటపాడు 485 టన్నులు డీలర్ల వద్ద నిల్వ ఉందన్నారు. యూరియా నిల్వలను ప్రైవేట్, సొసైటీ, రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 23, 2025

పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్

image

పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.

News December 23, 2025

భీమవరం: రబీ సాగుపై అధికారులతో జేసీ సమీక్ష

image

జిల్లాలో రబీ సాగుకు సంబంధించి ఎరువుల లభ్యతపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆర్.ఎస్.కేలు, సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద రబీకి సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడీఏలు, ఎంఏఓలు, ఆర్.ఎస్.కే సిబ్బంది పాల్గొన్నారు.