News March 11, 2025
నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి భేటీ

మంత్రి KVR ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలపై ఆయనతో సమగ్ర చర్చలు జరిపారు. టెన్నాలీ-HYD ఎక్స్ప్రెస్ హైవే, WGL – KMM జాతీయ రహదారి విస్తరణ, HYD రింగ్ రోడ్డు విస్తరణ అంశాలపై KVR గడ్కరీతో ప్రస్తావించారు. TGలో పెండింగ్లో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారు.
Similar News
News October 23, 2025
ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.
News October 23, 2025
జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపిక

పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి గ్రామానికి చెందిన తప్పెట పవన్ కుమార్ జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపికయ్యాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో అక్టోబర్ 11 నుంచి 14 వరకు జరగనున్న 16వ సౌత్ జోన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ పోటీల్లో అతను తెలంగాణ తరపున పాల్గొననున్నాడు. పవన్ ఎంపిక పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
News October 23, 2025
పర్వతగిరి: రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఏజెంట్లు..!

<<18081238>>సీడ్ పేరుతో రైతులను నట్టేట ముంచారని గురువారం<<>> “Way2News”లో ప్రచురించిన కథనానికి గాను గ్రామానికి చెందిన ఏజెంట్లు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. రైతులకు సంబంధించిన రూ.70 లక్షలను నవంబర్ 10వ తేదీ వరకు చెల్లిస్తామని, చెల్లించకపోతే గ్రామంలో తమకున్న భూమిని జప్తు చేసుకునే అధికారం రైతులకు కల్పిస్తూ అగ్రిమెంట్ పత్రం రాసి ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా రైతులు శాంతించారు.