News June 20, 2024
నిత్యవసర వస్తువుల సరఫరాకు టెండర్ల స్వీకరణ: కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 27 గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ విద్యాలయాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయుటకు ఆసక్తిగల వారి నుంచి టెండర్లు స్వీకరిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈనెల 21 నుండి 25 వరకు టెండర్ పారంలను ఉ. 10:30 గంటల నుంచి సా.ఐదు గంటల వరకు కార్యాలయం పని దినాలలో టెండర్ షెడ్యూల్ ఐటీడీఏలోని ప్రాంతీయ సమన్వయ అధికారి గురుకులం కార్యాలయం నందు పొందాలన్నారు.
Similar News
News November 17, 2025
ఖమ్మం టీహబ్లో సాంకేతిక సమస్యలు!

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 17, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} జిల్లాలో నేటి నుంచి స్కూళ్లలో తనిఖీలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం


