News March 15, 2025

నిత్యవసర సరుకుల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలి: అల్లూరి కలెక్టర్

image

అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం వినియోగదారుల వ్యవహారాల సదస్సులో కలెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరూ స్థిరమైన జీవనశైలికి అలవాటు పడ్డారన్నారు. యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, వృద్ధుల్లో ఆలోచన విధానం మారాలని చెప్పారు. సంతల్లో విక్రయించే నాసిరకం పదార్థాలు, శీతల పానీయాలు విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు. కల్తీ నిత్యవసర సరుకుల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 1, 2025

శ్రీపతిపల్లి: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు

image

‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. చిల్పూర్(M) శ్రీపతిపల్లికి చెందిన రంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, ఆయన సోదరుడు రంగు హరీష్ BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి పోటీలో నిలవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

News December 1, 2025

సీఎం పర్యటనలో లోపాలు చోటు చేసుకోవద్దు: ADB కలెక్టర్

image

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాకు చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలన్నారు.

News December 1, 2025

నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.