News March 22, 2025
నిధులు ఇవ్వమని సీఎంను కోరుతా: VZM కలెక్టర్

జిల్లాకు ప్రధానమైన తోటపల్లి కుడి ప్రధాన కాల్వ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎంను కోరనున్నట్టు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తిచేసేందుకు ఏమేరకు నిధులు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని కోరారు.
Similar News
News December 22, 2025
చట్ట పరిధిలో ఫిర్యాదులను పరిష్కరించాలి: VZM SP

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి 27 ఫిర్యాదులు అందాయి. భూతగాదాలు11, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారాలు 2, మోసాలు1, ఇతర అంశాలు 10 ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదుల పూర్వాపరాలను పరిశీలించి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్బంగా ఆదేశించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు.
News December 22, 2025
VZM: వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

ఏపీఎస్పీ బెటాలియన్లకు ఎంపికైన 208 స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకొని, మారుతున్న నేరాలు మరియు శాంతిభద్రతల సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని డీఐజీ సూచించారు.
News December 22, 2025
VZM: ‘PMAGY పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి’

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (PMAGY) పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈ పథకం అమలుపై సోమవారం సమీక్ష జరిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 500 జనాభా కలిగి, 40% ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోని మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలస మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ప్రతిపాదించారు.


