News March 29, 2025

నిధులు కేటాయింపులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

తుడా పరిధిలోని అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు కేటాయింపు విషయంలో అధికారులు నిబంధనలు పాటించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శనివారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో నగర కమిషనర్ మౌర్యతో కలిసి ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. తుడాకు సంబంధించి 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.611 బడ్జెట్ కు ఆమోదం తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిధులతో అభివృద్ధి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు

Similar News

News November 30, 2025

నలుగురు మంత్రులున్నా అభివృద్ధికి దూరంగా కొండగట్టు

image

ఉమ్మడి KNRలో కేంద్రమంత్రి, ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ కొండగట్టు దేవాలయం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ లేకపోవడం పాలకవర్గాల నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. తాగునీరు, వసతి గృహాలు వంటి కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మంత్రులు దృష్టి సారించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కేటాయించి కొండగట్టును అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

News November 30, 2025

APPLY NOW: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 30, 2025

ఖమ్మం: పెళ్లి పనుల్లో విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

సింగరేణి మండలం బొక్కల తండా గ్రామానికి చెందిన అజ్మీర విజయ్(24) శనివారం సాయంత్రం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. తిరుమలాయపాలెంలో పెళ్లి డెకరేషన్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ పైపుకు 33/11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘటన జరిగింది. విజయ్ అకాల మరణంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.