News August 21, 2024
నిధులు మంజూరు చేసినందుకు కృతఙ్ఞతలు: సీపీఐ

రోడ్లకు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు, అందుకు కృషి చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణకు సీపీఐ జిల్లా సమితి నాయకులు భూపేశ్ కృతఙ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆలూరులో ఆయన మాట్లాడారు. మొలగవల్లి గ్రామం నుంచి హోసూరు మీదుగా బీటీ రోడ్కు రూ.1.85 కోట్లు, మొలగవల్లి నుంచి నెమలికల్లు బీటీ రోడ్డుకు రూ.9 కోట్లు ఐదేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిందన్నారు.
Similar News
News February 11, 2025
కోరికల కొండ గురించి తెలుసా?

శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దాటిన తర్వాత కోరికల కొండ వస్తుంది. ఈ కొండ మీద మన కోరిక చెప్పుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం. పెళ్లి కావాలనుకునే వారు అక్కడ చిన్న పందిరి వేస్తారట. సంతానం కోరుకొనే వారు ఉయ్యాల కడతారు. సొంతిల్లు కావాలనుకునే వారు ఒక రాయి మీద ఇంకో రాయి పేరుస్తారు. కొంత మంది తమ కోరికలు ఆ కొండ మీద మట్టిలో చేతితో రాస్తారట. మరి మీరు శ్రీశైలానికి పాదయత్రగా వెళ్లారా?
News February 11, 2025
నేడు అహోబిలం రానున్న హీరో సాయిదుర్గ తేజ్

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం ఆలయ దర్శనార్థం మంగళవారం ఉదయం 10 గంటలకు హీరో సాయిదుర్గ తేజ్ వస్తున్నట్లు జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని అభిమానులు అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆయన పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2025
ఛాంపియన్గా కర్నూలు జిల్లా జట్టు

యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పెద్దపాడులోని ఓ పాఠశాల నందు నిర్వహిస్తున్న 1వ రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేఎంసీ డిప్యూటీ మేయర్ రేణుక ముఖ్య అతిథిగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. కర్నూలు, అనంతపూర్, నంద్యాల జిల్లా జట్లు వరుసగా మూడు స్థానాలలో నిలిచాయి.