News July 7, 2024

నిధుల్లేక గ్రామ పంచాయతీల పరేషాన్!

image

ఖమ్మం జిల్లాలో 589, కొత్తగూడెం జిల్లాలో 481 జీపీలు ఉన్నాయి. ఐతే పారిశుద్ధ్యం నిర్వహణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు నేడు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారాయి. డబ్బులు లేక ట్రాక్టర్లు కార్యాలయంలోనే ఉంచుతున్నారు. బయటకు తీస్తే డిజీల్ కు డబ్బులు కావాలి. పెట్టుబడులు పెట్టే వారు లేరు. ఇప్పటికే అందినకాడికల్లా అప్పులు తెచ్చి పెట్టిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం చేతులేత్తేశారు.

Similar News

News October 1, 2025

‘ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఖమ్మం: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్/ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన హ్యండ్ బుక్ ఒకటికీ రెండుసార్లు పరిశీలించాలని, ముఖ్యమైన నిబంధనలు మార్క్ చేసి పెట్టుకోవాలని సూచించారు.

News October 1, 2025

హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత: CP

image

గతేడాది మాదారం నుంచి ఖమ్మం విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్‌కు చెందిన హోంగార్డు చందర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా హోంగార్డు కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్‌తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ.34 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.

News October 1, 2025

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

image

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్  పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి గత ఖరీఫ్ సీజన్ పెండింగ్ ఉన్న 11 వేల 500 మెట్రిక్ టన్నులు రా రైస్, 3500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ రాబోయే 20 రోజులలో ఎఫ్సీఐకు సరఫరా చేయాలని సూచించారు.