News February 17, 2025

నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు: DMHO

image

నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. BHPL జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు 8 రోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపారు. ఆర్.బి.ఎస్.కె, టీం ద్వారా ఫేస్ 1, ఫేస్ 2లో 5 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కళ్లు స్క్రీనింగ్ చేసి కంటి సమస్యలు గుర్తించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 13, 2025

అనుమానమే పెనుభూతం.. మహిళ హత్య కేసులో సంచలనాలు.!

image

విజయవాడలో పట్టపగలే భార్యను కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన <<18275922>>కలకలం రేపింది<<>>. కృష్ణా (D)నాగాయలంకకు చెందిన విజయ్, నూజివీడుకు చెందిన నర్సు సరస్వతిని 4ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఏడాది క్రితం విడిపోగా, భార్యపై అనుమానం పెంచుకున్న విజయ్ ఆమెను హత్యచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

News November 13, 2025

మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

image

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 13, 2025

తిరుపతి: 164 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు.!

image

EC ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ–2025లో భాగంగా 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 38 కేంద్రాల ప్రాంతాల మార్పు, 9 పేర్ల మార్పు,164 కొత్త కేంద్రాల ప్రతిపాదనలతో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందన్నారు.