News February 17, 2025
నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు: DMHO

నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. BHPL జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు 8 రోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపారు. ఆర్.బి.ఎస్.కె, టీం ద్వారా ఫేస్ 1, ఫేస్ 2లో 5 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కళ్లు స్క్రీనింగ్ చేసి కంటి సమస్యలు గుర్తించనున్నట్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
NTR: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు..త్వరపడండి

ఎన్టీఆర్ వైద్యసేవలో 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి(టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APMC రిజిస్ట్రేషన్ కలిగి MBBS పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని, https://apmsrb.ap.gov.in/msrb/లో ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V.సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్సైట్ చూడాలన్నారు.
News September 15, 2025
మూసీకి తగ్గిన వరద

మూసీ నదికి వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 4,385.47 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.70 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అధికారులు 3 క్రస్ట్ గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.
News September 15, 2025
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు

APPSC 10 తానేదార్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 330. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/