News April 15, 2025

నిబద్ధతతో పని చేయాలి: MHBD ఎస్పీ

image

పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే నిబద్ధతతో పని చేయాలని MHBD ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్‌లో కోర్టు డ్యూటీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసు ఛార్జి షీట్లను నిర్దేశిత కాలంలో న్యాయస్థానాలకు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 17, 2025

కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 17, 2025

పాడేరు: హాట్ బజార్స్ నిర్మాణాలపై సమీక్ష

image

హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆదేశించారు. ఐటీడీఏలో జీసీసీ, వెలుగు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని తెలిపారు.

News April 17, 2025

జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

జేఈఈ మెయిన్ సెషన్ 2 <>ఫైనల్ కీ<<>> విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సెషన్ 2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

error: Content is protected !!