News January 27, 2025
నిమ్మనపల్లె: చిన్నారి మృతి.. ట్రాక్టర్ డ్రైవర్ అరెస్టు

చిన్నారి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ను అరెస్టు చేసినట్లు నిమ్మనపల్లె ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొని కొండయ్యగారిపల్లికి చెందిన సురేశ్, పవిత్రల కుమార్తె గానవి(2) మృతి చెందిన సంగతి తెలిసిందే. చిన్నారి మృతి ఘటనతో డ్రైవర్ రెడ్డి బాషా ఖాన్పై రాత్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సోమవారం సాయంత్రం నిమ్మనపల్లె వద్ద డ్రైవర్ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News October 20, 2025
మాలేపాటి మృతిపై మంత్రి లోకేశ్ సంతాపం

APఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్గా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’. అని అన్నారు.
News October 20, 2025
మరణంలోనూ వీడని బంధం.. ఒకేరోజు భార్యాభర్తల మృతి

నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని ఆరువేటి లక్ష్మీనారాయణ (85), వెంకట లక్ష్మమ్మ (80) దంపతులు ఒకే రోజు మరణించారు. 60ఏళ్ల వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉన్న వారు అనారోగ్యం కారణంగా వారిద్దరూ ఆదివారం మృతి చెందారు. ఒకేరోజు ఇద్దరు చనిపోవడం వింతగా ఉందని, ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరణంలోనూ వీడని బంధంగా ఈ సంఘటన నిలిచిందని పేర్కొన్నారు. స్థానికులు నివాళి అర్పించారు.
News October 20, 2025
భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు దీపావళి వేళ భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 549 పాయింట్ల లాభంతో 84,501, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,869 వద్ద స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్ కాగా ICICI బ్యాంక్, JSW స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ONGC టాప్ లూజర్స్.