News March 17, 2025

నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలి: పీవో

image

రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల గిరిజన నిరుద్యోగులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 5 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

Similar News

News November 5, 2025

NLR: జనసేనలో విబేధాలపై రహస్య విచారణ

image

నెల్లూరు జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు MSME ఛైర్మన్ శివ శంకర్ వచ్చారు. రెండు రోజుల పాటు నేతలతో విడివిడిగా మాట్లాడారు. నివేదికను జనసేనానికి అందివ్వనున్నారు. జనసేనాని జోక్యంతో నేతల్లో ఉన్న అసంతృప్తి జ్వాల చల్లారుతుందో లేదో చూడాలి.

News November 5, 2025

సంగారెడ్డి: 11న కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 11న కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ తెలిపారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో జేఏసీ సమావేశం మంగళవారం నిర్వహించారు. జాతీయ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

News November 5, 2025

BREAKING: గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జమ్మిచేడు నుంచి గద్వాల వైపు బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా, అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గద్వాల పట్టణానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.