News August 31, 2024
నిరుపయోగంగా మారిన సేంద్రియ ఎరువు తయారీ షెడ్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. ఒక్కొక్క షెడ్డుకు రూ.12 లక్షలు వెచ్చించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ఎరువు తయారికి అనుగుణంగా వీటిని నిర్మించారు. అధికారుల, సిబ్బంది అలసత్వం కారణంగా నేటికీ అవి చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.
Similar News
News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
News February 18, 2025
నర్సరీల పెంపకం వేగవంతం చేయాలి: కలెక్టర్ త్రిపాఠి

రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడాన్ని పూర్తిచేయాలని, షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News February 17, 2025
ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

NLG: ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో అత్యవసరంగా పనులు చేపట్టాల్సి వస్తే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంఎస్ఓ లు,ఎంఈఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు,ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఆదర్శ పాఠశాలలో అత్యవసర పనులు అయితే వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు.