News February 25, 2025
నిర్భయంగా చికెన్ తినండి: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో బర్డ్ఫ్లూ గానీ, ఆ లక్షణాలు గల కోళ్లు గానీ లేవని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు ధ్రువీకరించినట్లు కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. అందువల్ల ప్రజలు చికెన్, కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చన్నారు. మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన చికెన్ మేళాలో పాల్గొన్న ఆమె పాల్గొని మాట్లాడారు. 100డిగ్రీల వేడిలో బ్యాక్టీరియా, వైరస్ బతికే అవకాశాలు లేవన్నారు.
Similar News
News October 23, 2025
నాగార్జునసాగర్: సాధించిన దానికంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి

నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం ఈ ఏడాది లక్ష్యాన్ని మించి విద్యుత్తును ఉత్పత్తి చేసిందని జెన్కో సీఈ మంగేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది 70 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, మంగళవారం రాత్రికి ఆ లక్ష్యాన్ని మించి ఉత్పత్తిని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐడల్ డైరెక్టర్ అజయ్ కుమార్ విద్యుత్ అధికారులను అభినందించారు.
News October 23, 2025
కృష్ణా: నేడు జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, 17 బాల బాలికల జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపికలు నేడు జరగనున్నాయి. విజయవాడలోని సిద్దార్థ పాఠశాల ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు ఎంపికలు మొదలవుతాయి. క్రీడాకారులు స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, హెచ్ఎం సంతకం, సీల్తో ఉన్న ఎంట్రీ ఫారం తప్పనిసరిగా తీసుకురావాలని కార్యదర్శి దుర్గారావు తెలిపారు.
News October 23, 2025
NLG: డీసీసీ అధ్యక్ష పదవికి 20 మంది దరఖాస్తు

నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల పరిశీలకులు బిశ్వరంజన్ మహంతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న 20 మందిలో 10 మంది బీసీలు, నలుగురు ఓసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు. ఈ దరఖాస్తుదారుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం.