News February 10, 2025
నిర్మలా సీతారామన్తో విశాఖ ఎంపీ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739185783233_20522720-normal-WIFI.webp)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బడ్జెట్లో 12 లక్షల వరకు వచ్చే జీతాలకు ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కుదించడంతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.
Similar News
News February 11, 2025
విశాఖ: ఉపాధ్యాయ MLC.. అందరూ అర్హులే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739260624978_20522720-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థులందరి నామ పత్రాలు ఆమోదం పొందాయి. ఎన్నికల అబ్జెర్వర్ నాయక్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం కలెక్టరేట్లో పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ప్రమాణాలకు అనుగుణంగా అందరి పత్రాలు ఉండటంతో 10 మంది అభ్యర్థుల తాలూక నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
News February 11, 2025
UPDATE: రీల్స్ పేరుతో పెళ్లి.. యువకుడిపై పోక్సో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739246728922_1100-normal-WIFI.webp)
ఓ బాలిక ఇన్స్టాగ్రామ్లో చేసిన రీల్కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక రీల్కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరై పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్పై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సోమవారం రిమాండ్ విధించారు.
News February 11, 2025
విశాఖ: రోడ్డుప్రమాదంలో యువతి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739239124763_1100-normal-WIFI.webp)
విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్ చేస్తోంది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్పై ఆటోనగర్ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఉషారాణి కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.