News April 4, 2025

నిర్మల్‌లో మహిళ సూసైడ్

image

ఆచూకీ తెలియని ఓ మహిళ నిర్మల్ పట్టణంలోని నటరాజ్ చెరువు వద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లతో శవాన్ని బయటకు తీయించామని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 20, 2025

మొన్న కవిత కామెంట్.. నిన్న తుమ్మల రియాక్షన్

image

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కవిత పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ లీడర్‌ను వదులుకొని కేసీఆర్ పెద్ద పొరపాటు చేశారని, బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు. కవిత కామెంట్స్ చేసిన మరుసటి రోజే బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. ముందు కవిత చేసిన వ్యాఖ్యలకు BRS సమాధానాలు చెప్పాలని తుమ్మల అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

News November 20, 2025

NZB: నకిలీ పత్రాలు సృష్టించి ప్రొఫెసర్‌కు రూ.47 లక్షలు కూచ్చుటోపి

image

నిజామాబాద్‌లో లేని భూమి ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఓ ప్రొఫెసర్‌కు రూ.47 లక్షల కుచ్చుటోపి పెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినాయక నగర్‌కు చెందిన ప్రొఫెసర్ కనకయ్యకు ఎకరం భూమి కొనిస్తామని చెప్పి చిలుక సాయిలు, షేక్ అహ్మద్ నబీ, బండి రవి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రూ.47 లక్షలు తీసుకున్నారు. తీరా మోసపోయనాని భావించి 4వ టౌన్‌లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

News November 20, 2025

షుగర్ కేసులు.. దేశంలోనే హైదరాబాద్ నం.4

image

దేశంలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు అధికంగా ఉన్న నగరాల్లో HYD 4వ స్థానంలో నిలిచింది. జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం తగ్గడం, జంక్‌ఫుడ్, అధికంగా కార్బ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలని వైద్యులు తెలిపారు. గొంతు తడారడం, తరచూ మూత్ర విసర్జన, శరీర బరువు తగ్గటం, అలసటగా ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.