News March 24, 2025

నిర్మల్‌లో BJP X కాంగ్రెస్

image

నిర్మల్ జిల్లాలో రాజకీయాలు BJP X కాంగ్రెస్ అన్నట్లే నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో BRSఓటమి పాలైంది. నిర్మల్, ముధోల్ మాజీ MLAలు IKరెడ్డి, విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి పట్టుపెరిగింది. 2MLA స్థానాలను కైవసం చేసుకున్న BJP బలంగా ఉంది. ఖానాపూర్‌లో కాంగ్రెస్MLA బొజ్జు ప్రజల్లోకి వెళ్తుండగా BRSఇన్‌ఛార్జ్ జాన్సన్‌నాయక్ అప్పుడప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Similar News

News December 5, 2025

తిరుమల: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను ఇవాళ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. తొలి మూడు రోజులకు ఇప్పటికే ఈ-డిప్ ద్వారా టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు దర్శనాలకు ఉదయం 10గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు రిలీజ్ చేస్తారు. మధ్యాహ్నం 3గంటలకు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.

News December 5, 2025

నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.531కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మ.2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ (రూ.200Cr), మెడికల్ కాలేజీ (రూ.130Cr), నర్సింగ్ కాలేజీ (రూ.25Cr) భవనాల నిర్మాణాలకు, WGL-నర్సంపేట 4 లేన్ల రోడ్డు (రూ.82.56Cr), నర్సంపేట పరిధిలో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మ.3.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

News December 5, 2025

జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రికి వినతి

image

ఏలూరులో మూతపడిన జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఏలూరు, కొత్తూరులోని శ్రీకృష్ణ జూట్ మిల్స్‌కు చెందిన 2యూనిట్లు అకస్మాత్తుగా మూసివేయబడ్డాయి. దీంతో దాదాపు 5,000 మంది కార్మికులు నిరుద్యోగులుగా మారి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్మిక సంఘాల నేతలు ఇటీవల ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.