News February 21, 2025

నిర్మల్: అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం: కలెక్టర్

image

అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం పెంబి మండలం రాయదారిలో విద్యుత్ షాట్ సర్క్యూట్ వలన 6 నివాస గృహాలకు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద బాధితులకు భోజనం, రాత్రి బస ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు.

Similar News

News November 27, 2025

వనపర్తి: మూడో విడత ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు

image

వనపర్తి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు మూడో విడతలో ఓటింగ్‌లో పాల్గొననున్నారు. మొదటి విడతలో 1,23,183, రెండో విడతలో 1,24,281 మంది ఓటర్లు ఉండగా, మూడో విడతలోని 87 పంచాయతీలలో 1,34,851 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ పంచాయతీలు ఉన్నా, ఓటర్ల సంఖ్య మూడో విడతలోనే అధికంగా ఉంది.

News November 27, 2025

WPL షెడ్యూల్ విడుదల

image

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు 4వ ఎడిషన్ కొనసాగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, వడోదరలోని బీసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇవాళ WPL మెగా ఆక్షన్ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలను లీగ్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ ప్రకటించారు. ప్రస్తుతం ప్లేయర్ల వేలం కొనసాగుతోంది. మ్యాచ్‌ల తేదీలు త్వరలోనే వెల్లడించనున్నారు.

News November 27, 2025

కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

image

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.