News March 18, 2025
నిర్మల్ : అగ్ని వీర్ రిక్రూట్మెంట్కు దరఖాస్తులు

అగ్నిపథ్ స్కీం క్రింద అగ్ని వీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కొరకు జిల్లాలోని అవివాహిత పురుషులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ పరశురాం తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ లేదా స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్, వంటి వివిధ కేటగిరీల్లో నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
MHBD:ఈ కుర్చీకి అధికారం దక్కేది ఎప్పుడో..!

మహబూబాబాద్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి ఎవరికీ దక్కేది ఎప్పుడని స్థానిక అధికార పార్టీ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రంథాలయానికి ఛైర్మన్ను నియమించలేదు. గ్రంథాలయానికి ఛైర్మన్ పాలకమండలి లేకపోవడంతో గ్రంథాలయం సమస్యలను పట్టించుకునే నాథుడే కరవయ్యారని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఛైర్మన్ను నియమించలేదు.
News October 15, 2025
పీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు: సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కమాండ్ కంట్రోల్ నుంచి కలెక్టర్ సిరి, పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరపాండ్యన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు.
News October 15, 2025
22 నుంచి కపిలతీర్థంలో కార్తీకమాస ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీకమాస ఉత్సవాలు జరగనున్నాయి. నెల రోజులు పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 22న హోమాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. 22 నుంచి 23వ తేదీ వరకు శ్రీగణపతి స్వామివారి హోమం, 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీసుబ్రహ్మణ్య స్వామివారి హోమం జరుగనుంది.