News March 2, 2025

నిర్మల్ : అత్యధికం… అత్యల్ప ఉష్ణోగ్రత ఇక్కడే..!

image

మార్చ్ నెల అనగానే గుర్తుకు వచ్చేది వేసవి కాలమే.. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెల నుంచి మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. 16.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కూడా జాo గ్రామంలో నమోదు కావడం విశేషం. జిల్లాలో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదు అయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Similar News

News November 21, 2025

‘సెన్‌యార్‌’ తుఫాన్ – రైతులకు సూచనలు

image

‘సెన్‌యార్‌’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.

News November 21, 2025

నిజాంసాగర్: నవోదయ 6వ తరగతి అడ్మిట్ కార్డులు విడుదల

image

నిజాంసాగర్ జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల అయినట్లు ప్రిన్సిపల్ సీతారామ్ శుక్రవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష DEC 13న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను www.navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

News November 21, 2025

ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

image

వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్‌ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్‌కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.