News March 31, 2025

నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

image

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.

Similar News

News October 29, 2025

సంగారెడ్డి: బిడ్డపై తండ్రి ప్రేమ అంటే ఇదే..!

image

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం AEO శ్వేత రెండు కిడ్నీలు ఫెయిలై HYD కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె తండ్రి బిరాదర్ శ్యామ్‌రావు తన ఒక కిడ్నీని కూతురికి దానమిచ్చి ప్రాణం పోశారు. వీరి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్వేతకు ICU నుంచి జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేశారని ఆమె తల్లి ఉమారాణి తెలిపారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సభ్యుడు నాగేశ్ వారికి ధైర్యాన్నిచ్చారు.

News October 29, 2025

KNR: ‘గ్రూప్ పాలిటిక్స్‌కు చెక్’ పెట్టేది ఆయనేనా..?

image

KNR CONGలో గ్రూపు పాలిటిక్స్‌కు చెక్ పెట్టాలంటే MLA మేడిపల్లి సత్యం నాయకత్వం అనివార్యమని అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. DCC అధ్యక్షుడి ఎంపికలో భాగంగా జిల్లాకు వచ్చిన AICC పరిశీలకులకు మెజారిటీ కార్యకర్తలు మేడిపల్లి సత్యం పేరును సూచించినట్లు తెలుస్తోంది. అవసరం ఉన్నచోట MLAలను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ స్పష్టం చేశారు. దీంతో సత్యంకు DCC ప్రెసిడెంట్‌గా అవకాశాలు మెరుగయ్యాయి.

News October 29, 2025

సంగారెడ్డి జిల్లాకు 35 చెరుకు కోత యంత్రాలు..!

image

జిల్లాలో చెరుకు కోతకు కూలీల కొరత తీరనున్నది. ఈ మేరకు జిల్లాలో 35 చెరుకు కోత యంత్రాలు రంగంలోకి దిగనున్నాయి. ఒక్కో యంత్రం రోజుకు 70 నుంచి 100 టన్నుల చెరుకు కోసే సామర్థ్యం ఉంది. ఈ మేరకు బ్యాంకర్లు 5 యంత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లాలో మూడు చెరుకు ఫ్యాక్టరీల పరిధిలో 21 లక్షల టన్నుల చెరుకు పంట ఉత్పత్తి కానుందని అంచనా. చెరుకు తరలించేందుకు ప్రస్తుతం 18 కోత యంత్రాలు సిద్ధం చేస్తున్నారు.