News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.
Similar News
News December 22, 2025
NGKL: వైరల్ లోడ్ పరీక్షల కోసం రక్త నమూనాల సేకరణ

జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 144 మంది రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ.. రోగులకు ఏడాదికి ఒకసారి వైరల్ లోడ్, CD-4 కౌంట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగానే బాధితులకు తదుపరి చికిత్స, మందులు అందిస్తామని వివరించారు. ఈ శిబిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు తరలివచ్చారు.
News December 22, 2025
జగిత్యాల: ‘అంద విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయాలి’

అంద విద్యార్థుల కోసం ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బెక్కం జనార్ధన్. జగిత్యాల జిల్లా పరిధిలో సుమారు 150 నుంచి 200 మంది అంద విద్యార్థులు సుదూర ప్రాంతాలకి చదవడానికి వెళ్తున్నారని, అసలే అంద విద్యార్థులు దూర ప్రయాణం చేయడం వల్ల వారి తల్లిదండ్రుల బాధలు అంతా ఇంతా కాదన్నారు.
News December 22, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హవేలి ఘనాపూర్ మండలం శాలిపేట టర్నింగ్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన దాసరి సుమన్ (26), గుండు బాలయ్య బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


