News April 7, 2025

నిర్మల్: అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నూతన పథకాలు అమలు, ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయాలలో ఆఫ్ లైన్ విధానంలోనూ దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుదారులకు రసీదును ఇవ్వాలన్నారు.

Similar News

News November 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 53 సమాధానాలు

image

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ‘బ్రహ్మ, విష్ణువు’.
2. తారకాసురుని సంహరించింది ‘కార్తికేయ స్వామి’.
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు ‘వీరభద్ర’.
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి ‘జరా’.
5. పంచభూత స్థలాల్లో భూమి (పృథ్వీ) లింగం ‘కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం’లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 1, 2025

ప.గో: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

image

నల్లజర్ల మండలం దూబచర్ల విద్యా శిక్షణ సంస్థలో 4 సీనియర్ లెక్చరర్స్, 9 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ కమల కుమారి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు LEAP App లో దరఖాస్తు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు www.deoeluru.org వెబ్సైట్ పరిశీలించాలన్నారు. నవంబర్ 3 తో దరఖాస్తు గడువు ముగుస్తుందన్నారు.

News November 1, 2025

కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

image

ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనలో భాగంగా సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వకూడదని అధికారులకు సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు.