News March 29, 2024

నిర్మల్: అనారోగ్య కారణాలతో యువతి ఆత్మహత్య

image

అనారోగ్యంతో విసిగిపోయి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలగొండ విజయలక్ష్మి(20) బీడీ కార్మికురాలిగా పనిచేసేది. గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని చనిపోయినట్లు SI చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

ఆదిలాబాద్: ప్రచారానికి ముఖ్యనేతలేవరు రాలే..!

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కాసేపట్లో మైకులు మూగబోనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఎవరుకుడా ప్రచారానికి రాలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే జిల్లా కేంద్రంలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వస్తారనే ప్రచారం సాగినప్పటికీ వారి పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

News February 8, 2026

ADB: ఈ నెల 11న సెలవు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News February 7, 2026

ఉట్నూర్: పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించాలి

image

గిరిజన రైతులకు మల్బరీ పంట సాగుపై అలాగే పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించి, గిరిజన రైతులకు మంచి ఆదాయం వచ్చేలాగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని ITDA PO యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావలసిన రాయితీ వివరాలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.