News April 16, 2025
నిర్మల్: అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె వర్క్షాప్ నిర్వహించారు. అటవీ భూములపై చేపట్టే అభివృద్ధి పనులకు పరివేశ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 15, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. తుమ్మల వ్యూహం సక్సెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తుమ్మలను సీఎం రేవంత్ వెంగళరావు నగర్ ఇన్ఛార్జ్గా నియమించారు. కమ్మ కీలక నేతలను సీఎం రేవంత్ రెడ్డితో సమావేశపరిచి, హామీలు ఇప్పించారు. ఈ సామాజిక సమీకరణాల ద్వారానే కాంగ్రెస్ విజయం సాధించిందని, తుమ్మల వ్యూహం ఫలించిందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్.
News November 15, 2025
కుప్పం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం కావడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 9000716436, 80740 8806 నంబర్కి సమాచారం తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.
News November 15, 2025
నేడు జగిత్యాలతో లక్ష దీపోత్సవం

జగిత్యాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో జరుగనున్న లక్ష దీపోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని రాష్ట్ర సంపర్క సభ్యుడు వేముల సంతోష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని ఈసారీ యథావిధిగా గీత విద్యాలయం గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


