News April 16, 2025

నిర్మల్: అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె వర్క్‌షాప్ నిర్వహించారు. అటవీ భూములపై చేపట్టే అభివృద్ధి పనులకు పరివేశ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News October 10, 2025

నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం (M) ఈదగాలిలో నందగోకులం లైఫ్ స్కూలును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తారు. ఆ తర్వాత సమీపంలోని గోశాలకు వెళ్లి నంది పవర్ ట్రెడ్ మిల్, నందగోకులం సేవ్ ది బుల్ ప్రాజెక్టులతో పాటు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.

News October 10, 2025

కాసీపేట: కుళ్ళిపోయిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం

image

కాసీపేట మండలం పెద్దనపల్లి నాయకపుగూడ గ్రామ శివారు శుద్ధ వాగుఒడ్డులో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి (40) గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై ఆంజనేయులు చెప్పారు. గత 5రోజుల రోజుల క్రితం నీళ్లలో పడిపోయి చనిపోయి ఉండవచ్చని అనుమానించారు. కాసీపేట, బెల్లంపల్లి మండలాల గ్రామాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా కనబడకపోయినట్లయితే చూసి నిర్ధారణ చేసుకోవాలన్నారు.

News October 10, 2025

KMR: డ్రంక్ అండ్ డ్రైవ్‌..58 మందికి శిక్ష

image

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడిన 58 మంది వాహనదారులకు గురువారం కోర్టు శిక్షలు విధించింది. దేవునిపల్లి పరిధిలో 4 మందికి రెండ్రోజులు, 6 మందికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా పడింది. మరో 48 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.