News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
MHBD: ‘గుర్తులు’ వచ్చే వరకు మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

MHBD జిల్లాలో మొదటి, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. గ్రామాల్లో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. ఆయా గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు ఇంకా కేటాయించకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చే దాక తమని గుర్తుంచుకోవాలని ఓటర్లను వేడుకుంటున్నారు. గ్రామాలల్లో పోటాపోటీ రాజకీయం మొదలైంది.
News December 4, 2025
ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.
News December 4, 2025
జిల్లాలో 3,191 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం: కలెక్టర్

జిల్లాలో రూ.3,191 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం జిల్లాను వేగంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ న్యూ వీసీ హాల్లో హైబ్రిడ్ మోడ్లో ఆయన సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. చేపట్టిన పనులను అధికారులు వేగంగా పూర్తి చేయాలన్నారు.


