News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న<<15345603>> ఉపాధ్యాయులపై <<>>పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
సినిమా అప్డేట్స్

* 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తుడరుమ్’ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమాలు ఎంపికయ్యాయి.
* కమెడియన్ సత్య హీరోగా ‘మత్తువదలరా’ ఫేమ్ రితేశ్ రాణా డైరెక్షన్లో మూవీ ప్రారంభమైంది.
* కమల్ హాసన్ హీరోగా ‘KHAA-హంట్ మోడ్ ఆన్’ అనే వర్కింగ్ టైటిల్తో యాక్షన్ సినిమా రూపొందనుంది. స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బుమణి, అరివు మణి దర్శకత్వం వహిస్తారు.
News November 8, 2025
కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.
News November 8, 2025
పావలా వడ్డీకే రుణాలు: తిరుపతి కలెక్టర్

KVBపురం(M)లో రాయల చెరువు తెగి ఐదు ఊర్లు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద ధాటికి 57 మూగ జీవులు(26 ఆవులు, 18 గేదెలు, 13 గొర్రెలు) చనిపోయినట్లు సమాచారం. కొట్టుకుపోయిన జీవాలు కొన్ని ఇంటి బాట పట్టాయి. పశువులను కోల్పోయిన వారిని నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారన్నారు.


