News February 15, 2025

నిర్మల్: ఈనెల 17న ఇసుక నిల్వలకు వేలం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ కాలనీలో ఇటీవల అక్రమంగా నిల్వ ఉంచిన 35 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ, పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇసుకను వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇసుక వేలంలో పాల్గొనేవారు రూ.2 వేల రూపాయల రుసుము చెల్లించి ఈనెల 17న ఉదయం 11 గంటలకు నిర్వహించే టెండర్లలో పాల్గొనాలని తెలిపారు.

Similar News

News March 21, 2025

హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

✓ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించాలి
✓ ACBకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
✓ ముల్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
✓ HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వ్యక్తి మృతి
✓ HNK: అక్రమ రవాణాపై బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన
✓ ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన దామెర పోలీసులు

News March 21, 2025

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:కలెక్టర్ 

image

రేపటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, దీన్ని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

News March 21, 2025

CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

image

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

error: Content is protected !!