News April 12, 2025
నిర్మల్: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News February 12, 2026
జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

ప్రస్తుత కాలంలో కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వారానికోసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.
News February 12, 2026
గద్వాల: కార్పొరేట్ శక్తులకు బీజేపీ ఊడిగం చేస్తోంది: DCC చీఫ్

బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వాలను కాలరాస్తోందని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. గురువరం గద్వాలలో సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన అతిథి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, విత్తన, విద్యుత్ బిల్లులను వెనక్కి తీసుకోవాలన్నారు.
News February 12, 2026
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ASF ఎస్పీ

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


