News February 25, 2025

నిర్మల్: ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

image

మహిళా సాధికారితకు బ్యాంకులు చేయూతను అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

ఉక్రెయిన్ కనీస కృతజ్ఞత చూపట్లేదు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపేందుకు US ప్రయత్నిస్తున్నప్పటికీ ‘కీవ్’ కనీస కృతజ్ఞత చూపట్లేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా నుంచి యూరప్ ఆయిల్ కొంటూనే ఉందని మండిపడ్డారు. US, ఉక్రెయిన్‌లో బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదంటూ జెలెన్‌స్కీ, బైడెన్‌‌లను SMలో విమర్శించారు. అయితే US చేస్తున్న కృషిపై కృతజ్ఞత ఉందని జెలెన్‌స్కీ తెలిపారు. కాగా ట్రంప్ <<18354785>>‘పీస్ ప్లాన్‌’పై<<>> చర్చలు కొనసాగుతున్నాయి.

News November 24, 2025

విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 24, 2025

GNT: అన్నదాతల ఇంటికే ప్రభుత్వం- ‘రైతన్న మీకోసం’ ఆరంభం

image

గుంటూరు జిల్లాలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. రైతన్నా.. మీకోసం పేరుతో అధికారులు సోమవారం నుంచి నేరుగా రైతుల ఇళ్లను సందర్శించనున్నారు. పథకాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడ జాప్యం ఉందో తెలుసుకుంటారు. పంచసూత్రాలు, యాంత్రీకరణ, సాంకేతిక పద్ధతులపై అవగాహన ఇస్తారు. రూ.14,000 పెట్టుబడి సహాయం అందించిన తర్వాత, ఇది మరో పెద్ద అడుగు అని అధికారులు చెబుతున్నారు.