News March 30, 2025

నిర్మల్: ఉగాది పర్వదినం.. ఖరీఫ్ సాగుకు శ్రీకారం

image

రైతులు పవిత్రంగా జరుపుకునే ఉగాది రోజునే ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడతారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి అరకతో పంట భూమికి వెళ్లి అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. వెంట తీసుకెళ్లిన పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. అనంతరం అరకతో కనీసం 5 సాళ్లను దున్నుతారు. చేలో ఉన్న చెత్త, చెదారాన్ని పోగుచేసి నిప్పు పెట్టి తిరిగి ఇంటికి వస్తారు. మళ్లీ సాయంత్రం మరోసారి వెళ్లి పూజలు చేసి వస్తారు.

Similar News

News December 9, 2025

BREAKING: తూ.గో జిల్లాలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా

image

తూ.గో జిల్లాలో తెల్లవారుజామున పెనుప్రమాదం తప్పింది. పెరవలిలోని తీపర్రు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 9, 2025

వనపర్తి: గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థుల నానాతంటాలు

image

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మటన్, మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటళ్ల వద్ద టీ, టిఫిన్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, నాయకులు శ్రమిస్తున్నారు.

News December 9, 2025

పెద్దపల్లి: ముగింపు దశకు మొదటి విడత ప్రచార పర్వం

image

పెద్దపల్లి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంథని, కమాన్పూర్, రామగిరి, శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో 99 సర్పంచ్, 896 వార్డు మెంబర్ల ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల కోసం నాయకులు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పలుచోట్ల అభ్యర్థులు సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.