News March 30, 2025
నిర్మల్: ఉగాది పర్వదినం.. ఖరీఫ్ సాగుకు శ్రీకారం

రైతులు పవిత్రంగా జరుపుకునే ఉగాది రోజునే ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడతారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి అరకతో పంట భూమికి వెళ్లి అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. వెంట తీసుకెళ్లిన పెరుగన్నం నైవేద్యంగా పెడతారు. అనంతరం అరకతో కనీసం 5 సాళ్లను దున్నుతారు. చేలో ఉన్న చెత్త, చెదారాన్ని పోగుచేసి నిప్పు పెట్టి తిరిగి ఇంటికి వస్తారు. మళ్లీ సాయంత్రం మరోసారి వెళ్లి పూజలు చేసి వస్తారు.
Similar News
News February 24, 2026
CM చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ: మంత్రి ఉత్తమ్

హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా తొలి విడతగా 1,000 మంది పేదలకు ఈ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులకు వీటిని కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.
News February 24, 2026
మాలలో పార్టీకి వెళ్లిన చరణ్పై విమర్శలు.. శిరీష్ క్లారిటీ!

హీరో అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయ్యప్ప మాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శిరీష్ స్పందించారు. ‘చరణ్ ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చారు. అప్పటికి అక్కడ ఎవరూ లేరు. పార్టీ కూడా మొదలుకాలేదు. ఎవరూ ఆల్కహాల్ కూడా ముట్టుకోలేదు. ఆయన మమ్మల్ని విష్ చేసి ఫొటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని తెలిపారు. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది.
News February 24, 2026
చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.


