News January 19, 2025
నిర్మల్: ఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్.. బాలుడి మృతి

నిర్మల్ జిల్లాలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టడంతో కొడుకు మృతిచెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెంబి మండలం సెట్పల్లి గ్రామానికి చెందిన పవర్ రాజు తన కొడుకు అఖిల్తో కలిసి బైక్పై రాత్రి పెంబి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా.. రాజు, అఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అఖిల్ మృతి చెందాడు.
Similar News
News February 11, 2025
ADB: FEB 18న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న సబ్-జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు వికారాబాద్ జిల్లాలోని 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.
News February 11, 2025
ADB: ఆమెపైన చీటింగ్ కేసు నమోదు చేయండి: నవీన్

ఏక కాలంలో రెండు రెగ్యులర్ కోర్సులు కలిగి టీచర్ ఉద్యోగం పొందిన సౌజన్యపైన న్యాయ విచారణ జరిపించాలని ప్రజావాణికి తాంసి మండలానికి చెందిన అభ్యర్థి నవీన్ కుమార్ కోరారు. ఒక సాధారణ విద్యార్థిగా సుమారు 350 కి.మీ దూరంగా ఉన్న వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి రెండు కోర్సులు చేయడం సాధ్యం కాదన్నారు. ఆమె తప్పుడు సర్టిఫికెట్ పెట్టి అధికారులను తప్పుదోవ పట్టించిందన్నారు. చీటింగ్ కేసు నమోదు చేయలన్నారు.
News February 11, 2025
ADB: ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన ప్రజ్ఞ కుమార్

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రత్నజాడే ప్రజ్ఞ కుమార్ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్కు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.