News March 23, 2024
నిర్మల్: ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

నిర్మల్ పట్టణంలోని వివేక్ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్మల్ పట్టణానికి చెందిన వంశీ అనే వ్యక్తి బైక్ తనిఖీ చేయగా అతని వద్ద రూ. 2 లక్షల నగదు లభించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మెుత్తంలో నగదును తరలించరాదని తెలిపారు.
Similar News
News December 23, 2025
ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.
News December 23, 2025
ADB: డాక్యుమెంట్ రైటర్పై కేసులు

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా పని చేస్తున్న సుభాష్ నగర్కు చెందిన వెన్నం నవీన్ పై 2 కేసులు నమోదు చేసినట్లు 2టౌన్ CI నాగరాజు తెలిపారు. సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వటానికి రూ.లక్ష తీసుకున్నాడు. అదే విధంగా మరొకరి దగ్గర దస్తావేజుల్లోనూ మార్పులు చేయటానికి రూ.56వేలు తీసుకొని ఇబ్బందులకు గురిచేయగా బాధితులు ఫిర్యాదు చేశారు.
News December 23, 2025
ఉట్నూర్: 7 ఏళ్లకు లభించిన భూమి పట్టా

ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన మండే మల్లారి, సండే సారూబాయ్లకు 7 సంవత్సరాలకు భూమి పట్టా లభించిందని ITDA PO యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం పట్టాలను వారికి అందజేశారు. తాండ్ర గ్రామ శివారులో గల 49/23/1/2 సర్వే నంబర్లో 5.03 ఎకరాలు, 49/23/3 సర్వే నంబర్లో 5.03 ఎకరాల భూమి విస్తీర్ణానికి పట్టా చేసి లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు.


