News April 6, 2025

నిర్మల్: ‘ఎస్ఎస్సీ స్పాట్‌కు రిపోర్ట్ చేయాలి’

image

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కోసం నియమించబడ్డ ఏసీఓలు, సీలు, ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లు, క్యాంపు సిబ్బంది సోమవారం ఉదయం 8 గంటల లోపు రిపోర్ట్ చేయాలని డీఈవో రామారావు సూచించారు. అధికారులు 12 గంటలలోపు క్యాంప్ అధికారికి రిపోర్ట్ చేయడంలో విఫలమైతే వారిపై సీసీఏ నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయన్నారు.

Similar News

News November 24, 2025

జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు పాడేరు విద్యార్థి ఎంపిక

image

పాడేరు శ్రీ మోదమాంబ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థి సీహెచ్ మోహిత్ సాయి రాష్ట్ర సబ్‌జూనియర్ విలువిద్య పోటీల్లో రెండో స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఆర్థిక సహాయం అందించి అభినందనలు తెలిపారు. క్రీడా అధికారి జగన్మోహన్ రావు, కోచ్ సుధాకర్ నాయుడు ఉన్నారు.

News November 24, 2025

వరంగల్: నిత్య పెళ్లికూతురి స్టోరీ.. వెలుగులోకి తెచ్చిన Way2News

image

తనకు వివాహమై కూతురు ఉన్నప్పటికీ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ ఫొటోలు పెట్టి అమాయకులను పెళ్లిళ్లు చేసుకుని, అందిన కాడికి నగలు, నగదుతో పరారవుతున్న కిలాడీ లేడీ గురించి <<18378294>>Way2News<<>> వెలుగులోకి తెచ్చింది. పోలీసులు, నిఘావర్గాలు ఘటనపై ఆరా తీశాయి. పలు పత్రికలు, టీవీ ఛానళ్లు సైతం ఘటన గురించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. Way2News కథనాన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

News November 24, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.6,950

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 70 వాహనాల్లో 594 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,950, కనిష్టంగా రూ.6,000 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,500 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.150 తగ్గింది.