News February 11, 2025

నిర్మల్: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మీ సేవలు కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. పట్టణంలోని 14 మీసేవ కేంద్రాల్లో మండలాలలో వేర్వేరు కేంద్రాల్లో దరఖాస్తులు చేస్తుండటంతో రద్దీ పెరిగింది. కొత్త కుటుంబాల వారే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

Similar News

News February 8, 2026

NZB మేయర్ BJP గెలిస్తే ప్రధాని వస్తారు: రఘునందన్ రావు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేరళ తిరువనంతపురంలో మేయర్ అభ్యర్థి గెలిస్తే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారని గుర్తు చేశారు. అలాగే ఇక్కడికి వస్తారని హామీ ఇచ్చారు.

News February 8, 2026

మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

image

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.

News February 8, 2026

GWL: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 77 వార్డులు ఉండగా 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు SP శ్రీనివాసరావు తెలిపారు. 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిపై ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తామన్నారు. బందోబస్తు నిర్వహణ మొదలుకొని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించే వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేస్తామన్నారు.