News April 6, 2025

నిర్మల్: కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి

image

జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో కోర్ట్ ఆఫ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ -2 జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆప్ ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం హైకోర్టు జడ్జ్ జస్టిస్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువలో ఉండటానికి ఈ కోర్టును ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన జడ్జి కర్ణ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జడ్జిలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

image

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.

News November 23, 2025

కనిగిరిపై కనికరించండి.. మహాప్రభో.!

image

కనిగిరిని కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపవద్దని ప్రజలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న కనిగిరిని మళ్లీ కొత్త జిల్లాలో కలిపే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కావాలన్న కల నెరవేరిన మూడేళ్లలోనే మళ్లీ మార్పులు వద్దన్న వాదన వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ఉండాలా? కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలోకి మారాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్.

News November 23, 2025

గుంటూరు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో గుంటూరుకు ప్రాధాన్యత దక్కింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. ఆయన నియామకం పట్ల జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.