News April 6, 2025
నిర్మల్: కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి

జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో కోర్ట్ ఆఫ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ -2 జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆప్ ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం హైకోర్టు జడ్జ్ జస్టిస్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువలో ఉండటానికి ఈ కోర్టును ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన జడ్జి కర్ణ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జడ్జిలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.
News April 23, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.
News April 23, 2025
9 నుంచి 27 ర్యాంక్కు పడిపోయిన ADB జిల్లా

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్లో 54.55, సెకండియర్లో 70.76గా నమోదైంది. ఫస్టియర్లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.