News February 19, 2025
నిర్మల్: జాతీయ రహదారిపై బైకు కారు ఢీ ఒకరి మృతి

మండలంలోని భాగ్యనగర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. కిషన్ రావు పేట చెందిన ఆత్మరామ్(55), అతని కొడుకు శ్రీకాంత్ భాగ్యనగర్ వద్ద బైక్ పై వస్తుండగా ఆర్మూర్ నుంచి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి వీరిని ఢీకొట్టింది. దీంతో ఆత్మరామ్ అక్కడికక్కడే మృతిచెందగా శ్రీకాంత్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News July 9, 2025
APలో భారీ పెట్టుబడి: TDP

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.
News July 9, 2025
రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను రేపు కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణ్ దేవ్ ప్రకటించారు. ఆండర్-13, 14 విభాగాల్లో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. 2011-12 సంవత్సరాల మధ్య జన్మించిన క్రీడాకారులు పోటీలకు అర్హులని తెలిపారు.
News July 9, 2025
ఆ రోజు ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయవద్దు: డీఈఓ

ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు సూచించారు. తల్లిదండ్రులకు విద్యార్థుల ద్వారా ముందస్తు సమాచారం అందించాలన్నారు. సమావేశం నిర్వహించే రోజు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా హాజరవ్వాలన్నారు. తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించే రోజు ఎవరికీ సెలవు మంజూరు చేయవద్దని తెలిపారు.