News April 28, 2024

నిర్మల్ జిల్లాకు రాహుల్ గాంధీ..!

image

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు అగ్ర నేతలతో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రానికి మే 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం రానున్నట్లు సమాచారం.

Similar News

News October 16, 2025

ADB: మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి లక్ష్యాలు, సన్నద్ధత, ప్రోత్సాహక విషయాలపై పలు సూచనలు చేశారు.

News October 15, 2025

డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు యువతకు ఆహ్వానం: ADB SP

image

జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మొదటి విడత 5 మండలాలలో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం తెలిపారు. ఈ నెల 18 వరకు వివరాలను పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ లేదా మీసేవ సెంటర్లలో రుసుములు చెల్లించాలని కోరారు. నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, భీంపూర్ మండలాల యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 15, 2025

సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

image

రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్‌ను రూపొందిస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నెల 25 వరకు జరిగే విజన్-2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని సూచించారు. ఈ సర్వే లింక్‌ను, QR కోడ్‌ను తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.