News January 21, 2025

నిర్మల్ జిల్లాకు 10,500 ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

image

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున నిర్మల్, ఖానాపూర్, ముధోల్ మూడు నియోజకవర్గాలకు కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 10,500 మంజూరు చేయనునట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం ఈనెల 24 వరకు గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 25, 2026

ADB: మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

image

ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా దీర్ఘకాలిక కేసుల నుంచి విముక్తి పొందవచ్చని, మార్చి 28న జరిగే అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

News February 25, 2026

ఆదిలాబాద్: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

image

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.

News February 25, 2026

ఆదిలాబాద్: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

image

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.