News March 24, 2025

నిర్మల్ జిల్లాకు 1,27,748 జవాబు పత్రాలు : DEO

image

మూల్యాంకన విధులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈవో రామారావు అన్నారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలో ఆదివారం సీసీఓలు, ఏసీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా‌కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన స్పాట్‌ వాల్యూవేషన్‌ క్యాంప్ ఉంటుందన్నారు. మూల్యాంకన విధులు పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. దాదాపు 1,27,748 జవాబు పత్రాలు జిల్లాకు చేరుతాయని తెలిపారు.

Similar News

News November 21, 2025

నేడు JNTUకి సీఎం రేవంత్ రెడ్డి

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలు నేడు ఉ.10 గం.కు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. దీనికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై లోగోను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా యూనివర్సిటీ నిర్వహిస్తున్న అలుమ్నీ మీటింగ్ కూడా ప్రారంభించి విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News November 21, 2025

వరంగల్: విద్యార్థుల వికాసానికి ‘చెలిమి’

image

ఉద్యోగుల భావోద్వేగ స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పాజిటివ్ ఆలోచనలను పెంపొందించేందుకు ప్రభుత్వం చెలిమి సోషియో-ఎమోషనల్ వెల్‌బీయింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 92 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన నోడల్ టీచర్లు హైద‌రాబాద్‌లో మూడు విడతలుగా శిక్షణ పొందుతున్నారు. అనంతరం 6వ తరగతి పై విద్యార్థులకు చెలిమి కరికులం అమలు చేయనున్నారు. భావోద్వేగాలు, స్వీయ నియంత్రణ, పాజిటివ్ ఆలోచన ప్రధాన లక్ష్యం.

News November 21, 2025

HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.