News March 24, 2025
నిర్మల్ జిల్లాకు 1,27,748 జవాబు పత్రాలు : DEO

మూల్యాంకన విధులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈవో రామారావు అన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఆదివారం సీసీఓలు, ఏసీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యూవేషన్ క్యాంప్ ఉంటుందన్నారు. మూల్యాంకన విధులు పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. దాదాపు 1,27,748 జవాబు పత్రాలు జిల్లాకు చేరుతాయని తెలిపారు.
Similar News
News November 23, 2025
GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

ఖైరతాబాద్ జోన్లో మొత్తం 506 పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!చార్మినార్ జోన్లో 728 పనులు పెండింగ్లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది. LBనగర్ జోన్లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి. <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.
News November 23, 2025
SRCL: డ్రగ్స్కు దూరంగా ఉందాం: డబ్ల్యూఓ లక్ష్మీరాజం

బాల్యవివాహాలను అరికట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల మెదడు మొద్దుబారడం, కండరాలు పనిచేయకుండా పోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని విద్యార్థులకు వివరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు.
News November 23, 2025
నాగర్ కర్నూల్ జిల్లా TODAY.. టాప్ NEWS

*NGKL నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
*పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
*వెల్దండ: పాఠశాలలో మొక్కలు నాటిన డీఈవో
*NGKL: నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ధర్నా- సీఐటీయూ
*బల్మూర్: ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ- ఎమ్మెల్యే
*పెద్దకొత్తపల్లి: ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
*చారకొండ: విజయవంతమైన ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
*బిజినేపల్లి: నాటు వైద్యం వికటించి మహిళా మృతి


