News March 24, 2025

నిర్మల్ జిల్లాకు 1,27,748 జవాబు పత్రాలు : DEO

image

మూల్యాంకన విధులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈవో రామారావు అన్నారు. నిర్మల్‌ జిల్లాకేంద్రంలో ఆదివారం సీసీఓలు, ఏసీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా‌కేంద్రంలోని సెయింట్‌ థామస్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన స్పాట్‌ వాల్యూవేషన్‌ క్యాంప్ ఉంటుందన్నారు. మూల్యాంకన విధులు పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. దాదాపు 1,27,748 జవాబు పత్రాలు జిల్లాకు చేరుతాయని తెలిపారు.

Similar News

News October 21, 2025

విశాఖ: లెక్కల్లో తేడాలొస్తే భారీ మూల్యమే

image

GVMC పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లు రికార్డుస్థాయిలో సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6నెలల్లోనే రూ.256.5 కోట్లు వసూలు కాగా, వచ్చే 6నెలల్లో మరో రూ.276.49 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి జీవీఎంసీ రెవెన్యూ విభాగం ‘లైన్ లిస్టింగ్’ పేరుతో 8 జోన్ల పరిధిలో ఇళ్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను పరిశీలిస్తుంది. లెక్కల్లో తేడాలొస్తే అధికారులు భారీగా పన్నులు విధిస్తున్నారు.

News October 21, 2025

విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు

image

వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి. Share it

News October 21, 2025

సూర్యాపేట: సలాం పోలీసన్నా..!

image

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలను స్మరించుకుంటూ నేడు(అక్టోబరు 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారు. 2003లో చింతలపాలెం వద్ద నక్సల్స్‌ మందుపాతర దాడిలో ముగ్గురు, 2007లో తిరుమలగిరి దాడిలో ఇద్దరు, 2015లో హైటెక్ బస్టాండ్‌ ఘటనలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.