News February 1, 2025
నిర్మల్: జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలపాలి: DEO

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని డీఈఓ రామారావు అన్నారు. నిర్మల్ పట్టణంలోని పంచశీల్ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల కెరీర్ కౌన్సెలింగ్ గైడెన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.
Similar News
News February 27, 2026
విశ్రవసుడి గురించి మీకు తెలుసా?

విశ్రవసుడు గొప్ప వేద పండితుడు, తపశ్శాలి. పులస్త్యుని కుమారుడైన ఈయనకు అమిత శక్తి ఉంది. ఈయన మొదటి భార్య ఇలవిడ. వీరి సంతానమే కుబేరుడు. విశ్రవసుడి తపస్సుకు మెచ్చి సుమాలి తన కుమార్తె కైకసిని ఇచ్చి వివాహం చేశాడు. వీరి ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ జన్మించారు. రావణుడు తన తండ్రి మాటను కాదని, కుబేరుడిని లంక నుంచి వెళ్లగొట్టడంతో విశ్రవసుడు తీవ్ర మనస్తాపానికి గురై వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
News February 27, 2026
BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
News February 27, 2026
గ్రామ పంచాయతీలకు శుభవార్త

AP: LRS, BPSల కింద వచ్చిన ఆదాయంలో మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకూ వాటా ఇవ్వాలని ప్రభుత్వం తొలిసారి నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. LRS కింద గ్రామాల్లో వచ్చే ఆదాయంలో పంచాయతీలకు 50%, పట్టణాభివృద్ధి, ప్రణాళికా విభాగాలకు 50% ఇవ్వనున్నారు. BPS కింద గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయంలో పంచాయతీలకు 70% ఇస్తారు.
* LRS: Layout Regularization Scheme
* BPS: Building Penalisation Scheme


