News February 27, 2025

నిర్మల్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,206 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 7.04 శాతంగా పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 201 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 10.22 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 17, 2025

వరంగల్, హనుమకొండను కలిపి ఒకే జిల్లా?

image

WGL, HNKను కలిపి ఒకే జిల్లాగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. నేటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలంటూ పదే పదే వేదికల మీద BRSని విమర్శిస్తుండటం తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్ WGL‌ను ఒకే జిల్లాగా చేసి, మిగిలిన ప్రాంతాన్ని మరో జిల్లాగా కొనసాగించాలనే నిర్ణయంతో డ్రాఫ్టును జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

News November 17, 2025

నిడిగొండ: దీపాల కాంతుల్లో నిడిగొండ త్రికూటాలయం.!

image

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూటాలయం ఆదివారం సాయంత్రం జరిగిన కార్తీక దీపోత్సవంతో వెలుగులీనింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. దీపాల కాంతుల్లో త్రికూటాలయం అయోధ్య రామమందిరాన్ని పోలి ఉందనే దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

News November 17, 2025

ఆధార్ లేకున్నా స్కూళ్లలో ప్రవేశాలు!

image

TG: ఆధార్, బర్త్ సర్టిఫికెట్ లేకున్నా పిల్లలు బడిలో చేరొచ్చని విద్యాశాఖ తెలిపింది. గుర్తింపు పత్రాలు లేవని స్కూళ్లలో ప్రవేశాలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్లు లేవని వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.