News February 21, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1)కడెం: కానిస్టేబుల్‌కు హార్ట్ ఎటాక్.. CPR చేసిన ఎస్సై2)సారంగాపూర్: వరద కాల్వలో లారీ బోల్తా 3)లక్ష్మణచాంద: భార్య మందలించిందని భర్త సూసైడ్ 4)రాయదారిలో భారీ అగ్ని ప్రమాదం5)భైంసా: దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల సొత్తు స్వాధీనం 6)కుబీర్: చెక్‌పోస్టు వద్ద రూ.1,53,000 పట్టివేత 

Similar News

News November 22, 2025

వరికి మానిపండు తెగులు ముప్పు

image

వరి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం ఉంటే మానిపండు తెగులు లేదా కాటుక తెగులు ఆశించడానికి, వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని వల్ల వెన్నులోని గింజలు తొలుత పసుపుగా తర్వాత నల్లగా మారతాయి. తెగులు కట్టడికి వాతావరణ పరిస్థితులనుబట్టి సాయంకాలపు వేళ.. 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News November 22, 2025

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

image

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

News November 22, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేలో పరిహారం చెల్లింపుల్లో గందరగోళం..!

image

గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పూర్తిగా రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంగెం, నెక్కొండ, గీసుగొండ, పర్వతగిరి మండలాల్లో వేలాది ఎకరాలు ప్రాజెక్ట్‌లో పోయినా, కొంతమంది రైతులకు మాత్రమే పరిహారం జమ అయింది. భూములు పాస్‌పుస్తకాల నుంచి తొలగించడంతో రైతుభరోసా కూడా అందక రైతులు కుంగిపోతున్నారు. పంటలు వేయొద్దని అధికారులు చెప్పడంతో జీవనోపాధి సందిగ్ధంలో పడిందని రైతులు వాపోతున్నారు.