News February 21, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

1)కడెం: కానిస్టేబుల్కు హార్ట్ ఎటాక్.. CPR చేసిన ఎస్సై2)సారంగాపూర్: వరద కాల్వలో లారీ బోల్తా 3)లక్ష్మణచాంద: భార్య మందలించిందని భర్త సూసైడ్ 4)రాయదారిలో భారీ అగ్ని ప్రమాదం5)భైంసా: దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల సొత్తు స్వాధీనం 6)కుబీర్: చెక్పోస్టు వద్ద రూ.1,53,000 పట్టివేత
Similar News
News March 20, 2025
వరల్డ్ బెస్ట్ బ్రెడ్ మన ఇండియాదే!

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ మార్చి-2025 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ‘బటర్ గార్లిక్ నాన్’ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రెడ్గా నిలిచింది. ఇది 4.7 రేటింగ్తో ప్రథమ ర్యాంకును పొందింది. ఆ తర్వాత అమృత్సర్కు చెందిన ‘కుల్చా’కు రెండు, పరోటాకు ఆరో స్థానం లభించింది. కాగా, 8వ ర్యాంకులో ‘నాన్’, 18లో ‘పరాఠా’, 26లో ‘భతురా’, 28లో ‘ఆలూ నాన్’, 35 ర్యాంకులో ‘రోటీ’ ఉన్నాయి.
News March 20, 2025
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.
News March 20, 2025
రేపు కరీంనగర్కు రైల్వే జీఎం రాక

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం కరీంనగర్ రానున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద కరీంనగర్, రామగుండం రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జీఎం అరుణ్ కుమార్ ప్రత్యేక రైలులో ఉన్నత అధికారులతో కలిసి ఉదయం 8:30 గంటలకు కరీంనగర్ చేరుకుని రైల్వేస్టేషన్ను తనిఖీ చేసి, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం మ.1:00 వరకు రామగుండం వెళ్ళనున్నారు.