News March 11, 2025

నిర్మల్‌ జిల్లాలో పలువురు CIల బదిలీలు

image

నిర్మల్ జిల్లాలో పలువురు CIలను రాష్ట్ర పోలీసు అధికారులు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. డీసీఆర్‌బీలో CIగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్‌ను డీఎస్‌బీకి బదిలీ చేశారు. సీసీఎస్ విభాగంలో CIగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను నిర్మల్ రూరల్ CIగా, హైదరాబాద్‌లో వెయిటింగ్ లిస్టులో ఉన్న సమ్మయ్యను డీసీఆర్‌బీ నిర్మల్‌కు బదిలీ చేశారు.

Similar News

News March 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

image

UPI మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. యు.పి.ఐ వ్యవస్థను ఉపయోగించి వినియోగదారుల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును మాయం చేయడం సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు.

News March 26, 2025

శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

image

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.

News March 26, 2025

సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

image

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.

error: Content is protected !!