News February 5, 2025

నిర్మల్ జిల్లాలో బయటపడ్డ గణపతి, కాలభైరవ విగ్రహాలు

image

నిర్మల్ జిల్లా ముధోల్ జడ్పీ ఉన్నత పాఠశాల దగ్గరలోని పొలంలో గణపతి, కాలభైరవ విగ్రహాలు బయటపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఒక రాతి గుండు మీద రాష్ట్రకూట శైలిలో ఉన్న ద్విభుజ గణపతి విగ్రహం, దానికి ఒక పక్కన కాలభైరవుడు, మరో పక్క సర్పం విగ్రహాలు బయటపడ్డాయి. స్పష్టంగా చెక్కబడిన ఈ విగ్రహాలు రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. 9వ శతాబ్దానికి చెందిన భావిస్తున్న ఈ విగ్రహంలో గణపతి సుఖాసన స్థితిలో ఉంది.

Similar News

News December 2, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మణపల్లి 12.8°C, డోంగ్లి 13, గాంధారి 13.1, నస్రుల్లాబాద్ 13.2, జుక్కల్, బీబీపేట్, మేనూర్, బీర్కూర్ 13.3, బొమ్మన్ దేవిపల్లి 13.5, పెద్ద కొడప్గల్,సర్వాపూర్, పుల్కల్ 13.7, బిచ్కుంద 14, రామారెడ్డి 14.2, లచ్చపేట 14.4, మాక్దూంపూర్ 14.5, పిట్లం 14.6°C.

News December 2, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

News December 2, 2025

ధరలు డబుల్.. దానిమ్మ రైతులకు గోల్డెన్ టైం!

image

అనంతపురం జిల్లాలో దానిమ్మ రైతులకు మంచి రోజులొచ్చాయి. ప్రస్తుతం టన్ను ఏకంగా ₹లక్ష పలుకుతోంది. జిల్లాలో 13,381 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉంది. తాడిపత్రి, నార్పల, యల్లనూరు, పుట్లూరు, యాడికి తదితర మండలాల్లో అధికంగా సాగుచేశారు. 3 నెలల క్రితం టన్ను రూ.50-60 వేల వరకు ఉండగా ప్రస్తుతం రెట్టింపు అవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఇతర రాష్ట్రాలో దిగుబడి ఆలస్యం కావడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.