News April 11, 2025

నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్‌నగర్‌కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 2, 2025

HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

image

జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్‌పీఆర్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్‌లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.

News November 2, 2025

NLG: కాగితాలపైనే అంచనా లెక్కలు… రైతులందరికీ సాయమందేనా?

image

ఆకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే మొక్కుబడిగానే నిర్వహించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సాగు విస్తీర్ణం నష్టం నమోదులోనూ అదే తీరు కనిపిస్తుందన్నారు.

News November 2, 2025

వరంగల్: కబ్జాలతో కష్టాలు

image

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.