News April 11, 2025
నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్నగర్కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 8, 2026
KVS, NVSలో 15,762 ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

KVS, NVSలో 15,762 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు <
News January 8, 2026
విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్ప్రెస్’ రీషెడ్యూల్

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
News January 8, 2026
పేరుకే పెద్దన్న.. బాధ్యతల నుంచి పరార్: ట్రంప్ ద్వంద్వ నీతి!

ప్రపంచ దేశాలపై పెత్తనాలు చలాయించే అమెరికా అంతర్జాతీయ బాధ్యతల విషయంలో మాత్రం చేతులెత్తేస్తోంది. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకోవడం ట్రంప్ ద్వంద్వ నీతిని తెలియజేస్తోంది. అంతా తన గుప్పిట్లో ఉండాలని కోరుకునే ‘పెద్దన్న’ నిధుల వృథా సాకుతో తప్పుకోవడం విడ్డూరం. ‘అమెరికా ఫస్ట్’ పేరుతో బాధ్యతల నుంచి వైదొలగడం అంటే పరోక్షంగా అగ్రరాజ్య హోదాకు ఎసరు పెట్టుకోవడమేననే విశ్లేషణలు వెలువడుతున్నాయి.


