News February 25, 2025
నిర్మల్ జిల్లాలో 19,107 ఎమ్మెల్సీ ఓటర్లు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మొత్తం 19,107 మంది ఓట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 28, 2025
పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్

పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అర్జీలు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటిని డ్రైవ్ మోడ్లో క్లియర్ చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు.
లాగిన్లో అర్జీలు పెండింగ్లో ఉన్నాయంటూ మండల సర్వేయర్, తహశీల్దార్లను కలెక్టర్ ప్రశ్నించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 28, 2025
NZB: సమస్యలపై పోరాడే వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి

న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం NZB జిల్లా బార్ అసోసియేషన్లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమాలు దాడులు మొదలగునవి అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అన్నారు.
News November 28, 2025
KNR: వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును సందర్శించిన డీఎంహెచ్ఓ

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న కుటుంబ నియంత్రణ వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సల క్యాంపును డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డా.సనా జవేరియాతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాసెక్టమీ శస్త్ర చికిత్సలు చేసుకోబోతున్న, చేసుకున్న అర్హులైన దంపతులను కలిసి మాట్లాడారు. కరీంనగర్ ఆస్పత్రిలో 7, జమ్మికుంట సీహెచ్సీలో 6, మొత్తం 13 మందికి వ్యాసెక్టమీ చికిత్సలు జరిగాయన్నారు.


