News February 25, 2025
నిర్మల్ జిల్లాలో 19,107 ఎమ్మెల్సీ ఓటర్లు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మొత్తం 19,107 మంది ఓట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 28, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

సంగారెడ్డిలో 3 రోజులుగా జరిగిన SGF రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు అద్భుత ప్రదర్శనతో ద్వితీయ స్థానం(రన్నరప్) సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం-HYD జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు 6 పరుగుల స్వల్ప తేడాతో HYD జట్టు విజయం సాధించింది. ఖమ్మం జట్టు ప్రతిభావంతమైన ఆటతీరుతో రన్నరప్గా నిలవడంతో, జిల్లా క్రీడాకారులు, కోచ్లు అభినందనలు అందుకున్నారు.
News November 28, 2025
వేములవాడ TO అరుణాచలం RTC స్పెషల్ ప్యాకేజ్

వేములవాడ- అరుణాచలానికి RTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. DEC 6న ఉదయం వేములవాడలో బస్సు బయలుదేరి 7న కాణిపాకం, కంచి, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అదే రాత్రి అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు. 8న అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం బయలుదేరి 9న జోగులాంబ దర్శనం అనంతరం బస్సు వేములవాడకు తిరిగి వస్తుందన్నారు. పెద్దలకు రూ.5,100, పిల్లలకు రూ.3,850లను టికెట్ ఛార్జీలుగా నిర్ణయించారు.
News November 28, 2025
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.


