News February 25, 2025

నిర్మల్ జిల్లాలో 19,107 ఎమ్మెల్సీ ఓటర్లు

image

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మొత్తం 19,107 మంది ఓట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News November 23, 2025

తూ.గో: భార్యాభర్తల ఘర్షణ.. అడ్డొచ్చిన మామ మృతి

image

భార్యాభర్తల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎర్రకొండలో అల్లుడి చేతిలో మామ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సీఐ టి.గణేషశ్ వివరాల ప్రకారం.. శ్రీనివాస్ తన భార్య నాగమణితో గొడవ పడుతుండగా, ఆమె తండ్రి అప్పలరాజు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ బలంగా తోసేయడంతో సిమెంట్ రోడ్డుపై పడి అప్పలరాజు తలకు తీవ్ర గాయమై మృతి చెందారు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 23, 2025

అరుణాచలం వెళ్లే భక్తులకు పాలమూరు డిపో శుభవార్త

image

మహబూబ్ నగర్ జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in బుక్ చేసుకోవాలని తెలిపారు. 9441162588 నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 23, 2025

రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.