News March 31, 2025

నిర్మల్‌ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని మామడ మండలం తాండ్ర గ్రామంలో సోమవారం 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధకారులు వెల్లడించారు. సారంగాపూర్ మండలం జాం గ్రామంలో 21.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోత్రత నమోదైందన్నారు. కాగా రాష్ట్రంలో అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News February 25, 2026

జగిత్యాల: ఖాదీ గ్రామోద్యగ భండార్ కొనుగోళ్లు ప్రారంభం

image

జగిత్యాల పట్టణంలో బుధవారం మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టా ఖాదీ గ్రామోద్యోగ భండార్ కొనుగోలును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావ వసంత, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అడువాల జ్యోతి, భండార్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ భండార్ తహసీల్ చౌరస్తా, గాయత్రీ బ్యాంకు దగ్గర కొలువైంది.

News February 25, 2026

అష్టలక్ష్మి: ధనలక్ష్మి మాతను ఎలా పూజించాలంటే?

image

ధనలక్ష్మి దేవిని నీలి వస్త్రాలు, పూలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ‘నీలి రంగు విశాలత్వాన్ని, సంపద స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆ రంగున్న వస్తువులతో అమ్మవారిని పూజిస్తే సంపద నిలకడగా ఉంటుంది. ఇంట్లో దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వృద్ధిని ఆకాంక్షించే వారు ధనలక్ష్మి అమ్మవారిని ఇలా పూజించాలి. మంచి ఫలితాలుంటాయి’ అంటున్నారు.

News February 25, 2026

పెద్దపల్లి: గ్రామపంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం

image

బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవరోజు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాసు ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచి మేకల రోజారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.