News February 9, 2025
నిర్మల్ జిల్లా నేటి TOP NEWS

★ బైంసా: రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి ★ నిర్మల్: నులిపురుగుల మాత్రల పంపిణీ వాయిదా ★ రేపు నిర్మల్లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన ★ సిరిపల్లి చెక్ పోస్ట్ వద్ద రూ 1,53,000 నగదు పట్టివేత★ ముధోల్ ఇంటి నిర్మాణం తవ్వకాల్లో ఔరంగజేబు కాలంనాటి నాణేలు
Similar News
News March 15, 2025
జైనథ్: 2 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అశోక్

జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన దుర్ల అశోక్ కుమారుడు అవినాశ్ శుక్రవారం విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో ఎంపికయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ఉద్యోగం సాధించారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటు ప్రిపేర్ అయినట్లు అవినాశ్ తెలిపారు. ఉద్యోగం సాధించడం పట్ల ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేశ్ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
News March 15, 2025
IMLT20: ఫైనల్ చేరిన వెస్టిండీస్

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో వెస్టిండీస్ ఫైనల్కు దూసుకెళ్లింది. శ్రీలంక మాస్టర్స్తో జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఛేదనలో గుణరత్నే(66) పోరాడినా శ్రీలంక 173 పరుగులకే పరిమితమైంది. రేపు జరిగే ఫైనల్లో ఇండియా మాస్టర్స్తో వెస్టిండీస్ తలపడనుంది.
News March 15, 2025
పవన్కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం <<15762616>>పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు<<>> నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నమనే విషయాన్ని పవన్కి దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు.